బ్రెడ్డుతో జర జాగ్రత్త!

చాలా మంది బరువు తగ్గాలని ఉదయం సమయంలో అల్పాహారానికి బదులుగా బ్రెడ్డు తింటుంటారు. అయితే ఇది అంత మంచిది కాదంటున్నారు పరిశోధకులు. ప్రస్తుత జీవన ఆహారశైలికి ఇది పెద్దగా మేలు చేయదని అంతేకాక, ఉదర సంబంధ సమస్యలతోపాటు డిప్రెషన్‌ లాంటి మానసిక సమస్యలు వచ్చే పరమాదముందని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా బ్రెడ్‌, పాస్తాలాంటివి ఎక్కువగా తీసుకునే వారిలో మానసిక సమస్యలు ఎక్కువగా వస్తాయన్నారు. దీనికి ప్రధాన కారణం బ్రెడ్డులో గ్లూటెన్‌ అనే పదార్ధం ఉండటం అని వారు స్పష్టం చేస్తున్నారు. దీని వల్ల మెదడు మీద తీవ్ర ప్రభావం ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే ఇది అందరి విషయంలో జరగకపోవచ్చని కొందరి మీద మాత్రమే దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. దీనికోసం బ్రెడ్‌ తిన్న తరువాత పళ్ళు తీసుకుంటే కొంత వరకూ సమస్య నుంచి బయటపడవచ్చని వారు సూచిస్తున్నారు.

leave a reply