ఓ అరగంట సేపు అలానే ఉండిపోయా..!

ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌కు కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా.. ఆయన స్పందిస్తూ, ‘పద్మశ్రీ’ అవార్డు నాకు రావడం పట్ల మొదట నేను షాక్‌ అయ్యాను. ఓ అరగంట సేపు అలానే ఉండిపోయా.. ఏం చేయాలో అర్థం కాలేదు. నిజంగా నాకు ఇలాంటి గౌరవం దక్కుతుందని నేను అస్సలు ఊహించలేదు. సరిగ్గా.. నేను రాత్రి నిద్రపోయే ముందు అనుపమ్ ఖేర్‌జీ తనకు ఫోన్ చేసి పద్మశ్రీ వచ్చినట్టు తెలిపారు. ఈ విషయం తెలియగానే నా ఫ్యామిలీ మెంబర్స్‌, ఫ్రెండ్స్‌ అందరూ చాలా ఆనందపడుతున్నారు.

అయితే.. మీకో విషయం చెప్పాలి.. నాకు ‘పద్మశ్రీ’ వచ్చినందుకు నన్ను ఎవరూ తిట్టలేదు.. అందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా. గతంలో చాలా మంది నటులకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించినప్పుడు.. అందరూ వాళ్లు ఏం సాధించారని..? ఏ అర్హత ఉందని వాళ్లకు అవార్డులు ప్రకటిస్తున్నారని సోషల్‌ మీడియాలో తెగ ట్రోల్స్‌ నడిచేవి. అలాంటి రూమర్స్‌ ఏమీ నాపై రాకపోనందుకు చాలా ఆనందంగా ఉందన్నారు నటుడు మనోజ్‌.

తెలుగులో ‘మనోజ్‌ బాజ్‌పాయ్‌’ అందరికీ సుపరిచిత నటుడే. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘సత్య’ చిత్రంతో మనోజ్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తెలుగులో ఆయన హిందీ సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. ప్రస్తుతం మనోజ్‌ ‘సోన్‌ చిడియా’ అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అభిషేక్‌ చౌబే దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

leave a reply