ఫోన్ చేస్తే చాలు

రీసెంట్‌గా జరిగిన `వినయ విధేయ రామ’ ఆడియో లాంచ్‌ కార్యక్రమంలో చెర్రీ చాలా హాట్‌ హాట్‌ కామెంట్స్‌ చేశాడు. మోగా పవర్‌ స్టార్‌ చెర్రీ ఎప్పుడూ అంత ఆవేశంగా మాట్లడటం ఏ ఆడియో ఫంక్షన్‌లోనూ చూడలేదు. శ్రీరెడ్డి చేసిన కామెంట్స్‌కి రిప్లై ఇస్తూ ఈ మధ్య ఎవరూ జ్యూసులు కానీ.. కాఫీలు కానీ.. ఎవరూ తాగటంలేదు.. ఓన్లీ టీలే తాగుతున్నారు. మా బాబయ్‌ పబ్లిక్‌లోకి వచ్చి ఇంకొకరి కోసం.. యుద్ధం చేస్తున్న ఆయన్ని.. కించపరుస్తూ బీరు గ్లాసా.. గాజు గ్లాసా అని కామెంట్స్‌ చేయడం బాధాకరం మంటూ స్టేజ్‌పై చెప్పడం అందరినీ ఒక్కసారిగా షాక్‌కి గురిచేసిన అంశం.

అయితే.. మళ్లీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ.. పవన్‌ బాబాయికి ఎలాంటి సహకారానికైనా నేను ముందుంటాను. ఎందుకంటే.. ఆయన నా బాబాయి. ఆయన అడగాలే కానీ ఏదైనా చేస్తాం. ఆయనకు నచ్చని పని నేను ఎప్పుడూ చేయను. ఆయన నుంచి ఒక్క ఫోన్‌కాల్‌ వస్తే చాలు మేమంతా పరిగెత్తుకుంటూ వెళ్లి చేస్తాం. ఆయన మాకు అంత దగ్గర’. అంటూ అనడం రామ్‌ చరణ్‌ జనసేన పార్టీలో చేరతారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

leave a reply