జవాన్ల ప్రాణత్యాగం వృథా కాదు: ప్రధాని మోదీ

పుల్వామా ఉగ్రదాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.దాడికి ప్రతిదాడి ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలోని యవత్మాల్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడారు. ప్రజల ఆగ్రహాన్ని అర్ధం చేసుకుంటున్నామని అన్నారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి తగిన బుద్ధి చెబుతాం. భారత భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం అని చెప్పారు.జవాన్ల ప్రాణత్యాగం వృథా కాదని ప్రధాని మోదీ అన్నారు.

leave a reply