‘వెంకీమామా’లో పాయల్‌ రాజ్‌పుత్‌

వెంకటేష్‌, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీమామ’. ఈ సినిమాకి బాబీ దర్శకుడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వెంకటేష్‌ కుతురు పెళ్లిలో బిజీగా ఉన్న కారణంతో.. ఈ సినిమా షెడ్యూల్‌ కాస్త లేట్‌గా స్టార్ట్‌ అయ్యింది. ఈ వారం నుంచే చిత్రీకరణ షురూ అవుతుంది. ఇందులో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తుండగా, వెంకటేష్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌ ఎంపికైనట్టు సమాచారం. పాయల్‌ నటించిన మొదటి సినిమా ‘ఆర్‌ఎక్స్‌ 100’. ఈ సినిమాతో  ఒక రేంజ్‌లో పాపులర్‌ అయిన ఈ భామ ఇప్పుడు వెంకీమామాలో సందడి చేయనుంది. ప్రస్తుతం  వరుస అవకాశాల్ని అందుకొంటోంది. ఈ చిత్రంలో వెంకీ పల్లెటూరి అవతారంలో కనిపించబోతున్నట్టు సమాచారం. పట్టణంలో పుట్టి పెరిగిన కుర్రాడిగా నాగచైతన్య సందడి చేస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

leave a reply