నేను బాధలో ఉన్నప్పుడే నాకు సీఎం సాబ్ గుర్తొస్తారని మన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అంటున్నారు. షారుఖ్ ఏంటి? సీఎంకు ఫోన్ చేయడమేంటి అనుకుంటున్నారా? ఆ సీఎం ఎవరో కాదు.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్. ఈ మధ్య కాలంలో ముంబయిలో ‘ముంబయి 2.0’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫడణవీస్తో పాటు షారుక్ కూడా అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఫడణవీస్తో తనకున్న అనుబంధం గురించి షారుఖ్ వివరించారు. సీఎం సాబ్కు థాంక్స్ చెప్పాలనుకుంటున్నా, ఫఢణవీస్ నాకు ఎంత మంచి మిత్రుడంటే నేను ఒంటరిగా ఫీలవుతున్నప్పుడు వెంటనే ఆయనకు కాల్ చేసి మాట్లాడుతాను. నేను ఏ సమస్యలో ఉన్నా నాకు వెంటనే గుర్తొచ్చేది సీఎం సాబే.. నైట్ టైంలో ఎక్కువగా ఎవరికీ మెసేజ్లు చేయను. నేను మేల్కొని ఉన్నాను కదా అని వాళ్లు కూడా మేల్కొని ఉంటారని అనుకోను. కానీ 3 గంటలకు ఫడణవీస్కు నేను మెసేజ్ చేసిన రోజులున్నాయి. వాటిలో పర్సనల్, సామాజిక అంశాలకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. ఆయన కూడా వెంటనే నా మెసేజ్లకు స్పందిస్తూ చేస్తుంటారంటూ సీఎంతో తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు షారుక్.