మహేష్ బాబు 25వ సినిమా ‘మహర్షి’ సినిమా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మహేష్ 25వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ పైడిపల్లి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఓ సాధారణ రైతులా కనిపించబోతున్నారు. రామోజీఫిల్మ్ సిటీలో ఈ సినిమా కొంత చిత్రీకరణ పూర్తైయింది. అయితే.. ప్రస్తుతం ఈ సినిమా పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
కాగా.. భారీ సెట్ వేసి మరీ పొల్లాచ్చీలో షూటింగ్ చేస్తున్నారంట. దాదాపు 60 ట్రాక్టర్లతో, 30 నాగళ్లతో ఒక భారీ ఫైట్ పొలంలో తీస్తున్నారట. మహేష్ బాబు రైతుగా ట్రాక్టర్తో పొలం దున్నుతూ ఉండే సీన్లు కూడా ఇక్కడే తీస్తున్నారు. అక్కడ చిత్రీకరించే ఈ సన్నివేశాలు సినిమా హైలైట్స్లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. ఆ తన స్నేహితుడి కోసం ఇండియా వచ్చిన హీరో వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం మెయిన్ కథగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే మహేష్ ఈ సినిమాలో మాస్ లుక్లో అభిమానుల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు.