చరణ్ సినిమాకు… మరో ముఖ్య అతిధి?

అతిథులుగా జూనియర్ యన్.టి.అర్ మరియు రాజమౌళి వస్తున్నారని అందరికి తెలిసిందే.

రంగస్థలం సినిమా తరవాత రాంచరణ్ నటిస్తున్న చిత్రం ‘వినయ విధేయ రామ ‘ , ఈ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహిస్తున్నాడు ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలువబోతుంది. రాంచరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతున్న ఏ చిత్రం ఆడియో వేడుక ఈ నెల 20న పైన యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ కార్యక్రమానికి అతిథులుగా జూనియర్ యన్.టి.అర్ మరియు రాజమౌళి వస్తున్నారని అందరికి తెలిసిందే.  

కానీ వీరిద్దరితో పాటు ప్రముఖులు రాజకీయవేత్త అయినా కె .టి.అర్ గారు కూడా వస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఈ చిత్రానికి సంబంధించి టీజర్ కూడా రిలీజ్ అయినది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో లో వేసిన సెట్లో ఈషా గుప్తాతో స్పెషల్ పాటను చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది.

leave a reply