సూపర్స్టార్ ప్రిన్స్ మహేష్బాబు నటిస్తున్నతన 25వ సినిమా ‘మహార్షి’. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ రైతుగా కనిపించబోతున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. కాగా.. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ పొల్లాచ్చిలో జరుగుతుంది. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి.
అయితే.. మహేష్ను చూసేందుకు అక్కడ అభిమానులు షూటింగ్ జరిగే ప్రాంతానికి వెళ్లారు. ఆ గుంపులో నుంచి ఓ వ్యక్తి షూటింగ్ సన్నివేశాలను ఫొటో, వీడియోలను తీసి.. వాటిని వారే సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళనాడులోని పొల్లాచి ప్రాంతంలో తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తైనట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. తర్వాతి షెడ్యూల్ ఫిబ్రవరిలో మొదలవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.