ఈ మధ్య ప్రముఖ నటుడు మోగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గానే ఉంటున్నారని చెప్పాలి. తాజాగా ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం హీరోయిన్ బట్టలపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.. అలాగే.. పార్లమెంట్లో కూడా ఆడవారి డ్రెస్సింగ్ విధానంపై ఓ నేత చర్చ చేపట్జిన విషయం కూడా విదితమే. కాగా.. ఈ విషయంపై మోగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛాన్ల్లో స్పందించారు. ఆడవారి డ్రెస్సింగ్పై కామెంట్స్ చేయడానికి మీరెవరు..? అంటూ ఫైర్ అయ్యారు. వేసుకునే బట్టల్లో ఏముంది..? చూసే విధానంలో ఉంటుందని మండిపడ్డారు.
‘అసలు ఆడవారు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? నాకు తెలిసినంతవరకు పొట్టి దుస్తులు వేసుకునే వారిపైనే కాదు.. ఒళ్లంతా నిండుగా కప్పుకొనే ఆడపిల్లల పైనా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఆడపిల్లలు ఫలానా రకమైన దుస్తులు వేసుకోవడం వల్లే మగవారు వారితో తప్పుగా ప్రవర్తిస్తున్నారని అనుకోవడం తప్పు. ఎలాంటి దుస్తులైనా వేసుకునే హక్కు ఆడవారికి ఉంటుంది. అదే ఆడపిల్ల.. ఓ మగవాడ్ని ‘ప్యాంట్స్ వేసుకోవద్దు, అది మన సంప్రదాయం కాదు, పంచెలు కట్టుకోండి, గోనె గుడ్డలు చుట్టుకోండి’ అని ఎప్పుడైనా అనడం విన్నారా? అసలు మీ కళ్లు ఆడవారి దుస్తులపైకి ఎందుకు వెళ్తున్నాయ్?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. ప్రముఖ నటి ఇలియానా.. పోస్ట్ చేసిన హాట్ ఫొటోలపై కూడా స్పందించారు.
కాగా.. ఈ వీడియోపై నటి, యాంకర్ అయిన రష్మీ గౌతమ్ స్పందించి.. థ్యాంక్యూ నాగబాబు సార్.. అంటూ వీడియోను పోస్ట్ చేసింది. అలాగే.. ‘వేసుకునే బట్టల్లో ఏంముంటుంది..? అంతకు మించి మనిషిలో ఎన్నో గొప్ప విషయాలుంటాయి. ముందు మీరు వాటిని గుర్తించండి’ అంటూ.. మాకు మద్దతుగా ఉన్నందుకు నాగబాబు సార్కు థాంక్యూ అని చెప్పింది.