మహేష్ మైనపు విగ్రహం హైదరాబాద్‌కి..!

సింగపూర్‌లోని ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మహేష్‌ మైనపు విగ్రహాన్ని తయారు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మహేష్‌ కొలతలు కూడా తీసుకుని వెళ్లారు. కాగా.. ఆ విగ్రహాన్ని హైదరాబాద్‌కు త్వరలో తీసుకురానున్నారట. మహేష్‌కు చెందిన ఏఎంబీ థియేటర్‌లో ఈ విగ్రహాన్ని ఉంచుతారని సమాచారం. మహేష్ బాబు డేట్స్‌ చూసుకుని అభిమానుల కోసం మైనపు విగ్రహాన్ని హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ విగ్రహం హైదరాబాద్‌లో కేవలం ఒక్క రోజే ఉంటుంది.

కాగా.. ప్రస్తుతం మహేష్‌ ‘మహర్షి’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

leave a reply