ఉత్కంఠతో ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ ట్రైలర్‌

ఎన్టీఆర్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ ట్రైలర్‌ వచ్చేసేంది. ట్రైలర్‌ చూస్తుంటేనే ఆసక్తిగా.. ఎంతో ఉత్కంఠగా ఉంది. ఎన్టీరామారావు అన్ని కోణాల్లో కనిపిస్తారు. చిత్రరంగంలో ఎదురులేని వ్యక్తిగా ఎదిగిన మనిషికి.. రాజకీయాలు అంత ఈజీకాదనే విషయం అర్థమవుతుంది. ‘ఇచ్చిన ప్రతిమాట నిలబడాలి, చేసిన ప్రతి పనీ కనపడాలి, ఇన్‌టైమ్‌ ఆన్‌ డోర్‌’ అంటూ బాలయ్య చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ అల్టిమేట్‌గా ఉన్నాయి. పవర్‌ఫుల్‌ రాజకీయనాయకుడిగా కనిపించారు.

‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను’ అని బాలయ్య నాయకుడిగా తన మనసులోని మాట చెప్పడం ఆకట్టుకుంది. కాగా.. ఈ సినిమా ఈ నెల 22న ‌ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు క్లీన్‌ యు సర్టిఫికేట్‌ వచ్చింది. ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహించగా.. ఎన్బీకే ఫిల్మ్స్‌ పతాకంపై బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం సంస్థ సమర్పిస్తోంది.

leave a reply