నా బయోపిక్‌.. నేనే తీసుకుంటా..!

తాజాగా.. బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ చేసిన ఓ ప్రకటన ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. తన బయోపిక్‌ను తనే డైరెక్ట్‌ చేసుకుంటా అంటూ ప్రకటించింది. కాగా.. ఇప్పటికే తన బయోపిక్‌కు సంబంధించిన యూనిట్‌ను కూడా రెడీ చేసుకుంటుందట. అయితే.. ‘బాహుబలి’, ‘మణికర్ణిక’ చిత్రాలకు కథను అందించిన విజయేంద్ర ప్రసాదే ఈ బయోపిక్ కు కథను రెడీ చేస్తున్నట్టు సమాచారం. ‘మణికర్ణిక’కు పని చేసిన టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు కూడా పని చేయనుంది.

కొన్ని రోజులుగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ నా జీవితంపై పుస్తకం రాస్తానని అన్నారు. నేను ముందు కంగారు పడ్డా.. కానీ.. ఆయన గొప్ప రచయిత. నిజాయితీగా రాస్తారన్న నమ్మకంగా ఉందని చెప్పింది కంగనా. నా జీవితంలో నాకు సాయం చేసినవారి దగ్గర్నుంచి అవమానించినవారి వరకు అందరి గురించి నా బయోపిక్‌లో ప్రస్తావిస్తా. అయితే ఎవ్వరి పేరును బయటపెట్టను. ఎందుకంటే అలాంటివారి నుంచి నన్ను, నా జీవితాన్ని కాపాడుకోవాలి. మొత్తానికి సినీరంగంతో సంబంధం లేని ఓ చిన్న ప్రాంతానికి చెందిన అమ్మాయి బాలీవుడ్‌లో ఎలా అగ్ర కథానాయికగా ఎదిగింది అన్న విషయంపై నా బయోపిక్‌ ఉండబోతోంది’ అని వెల్లడించారు కంగన.

leave a reply