టీడీపీకి గుడ్ బై చెప్పిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది.చీరాల నియోజకవర్గం శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేశారు.పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు.త్వరలో అధికారికంగా వైకాపాలో చేరతానని వెల్లడించారు. ఈ పరిస్తితిలో సీనియర్‌ నేత కరణం బలరామ్‌ను చీరాల వెళ్లి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.దీంతో ఆయన స్థానిక నేతలతో సమావేశం కానున్నారు.

ఆమంచి కృష్ణమోహన్‌ స్వతంత్ర అభ్యర్థిగా గత ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసి గెలుపొందారు.అనంతరం తెదేపాలో చేరారు. ఈ మధ్య కాలంలో పార్టీ అధినేత చంద్రబాబుతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ మారతారన్న ఊహాగానాలను నిజం చేస్తూ తెదేపాకు రాజీనామా చేశారు.

leave a reply