రాజ్భవన్లో తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది.10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ కేబినెట్లో 16మందికి చోటు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ తొలి విడతలో 10 మందికి అవకాశం దక్కింది.తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలు కేటాయించారు.
ఎర్రబెల్లి దయాకరరావు : పంచాయతీరాజ్శాఖ
ఈటల రాజేందర్ : వైద్య ఆరోగ్యశాఖ
నిరంజన్రెడ్డి : వ్యవసాయశాఖ
తలసాని శ్రీనివాస్యాదవ్ : పశుసంవర్థకశాఖ
జగదీశ్రెడ్డి : విద్యాశాఖ
కొప్పుల ఈశ్వర్ : సంక్షేమశాఖ
ఇంద్రకరణ్ రెడ్డి : న్యాయ, అటవీ, దేవాదాయశాఖ
శ్రీనివాస్ గౌడ్ : ఎక్సైజ్శాఖ, పర్యాటకశాఖ
చామకూర మల్లారెడ్డి : కార్మిక శాఖ
ప్రశాంత్ రెడ్డి : రవాణా, రహదారులు, భవనాలశాఖ