ముంబయిలో దారుణం చోటుచేసుకుంది. బాలులపై అమానుష ఘటనలు రోజురోజుకూ ఎక్కువగా చోటుకుంటున్నాయి. అయితే.. అలాంటి ఘటనే ఒకటి ముంబయి లాల్బహదూర్శాస్త్రి నగర్లో చోటుచేసుకుంది. ఓ పదేళ్ల బాలుడు లైంగిక చర్యకు నిరాకరించాడన్న కోపంతో మరో 15 ఏళ్ల టీనేజర్ దారుణంగా హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. అనంతరం నింద తనపై పడకుండా ఉండేందుకు ఆ బాలుడి మృతదేహాన్ని ఓ సూట్కేసులో కుక్కి కాలువలో పడేశాడు. రెండు రోజుల నుంచి బాలుడు కనపించకపోయే సరికి బాలుడి తండ్రి పోలీస్ స్టేషన్లో కంప్లైట్ ఇవ్వగా.. ఈ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సాయంత్రం చివరిసారిగా తన కుమారుడిని ఓ టీనేజర్ స్నేహితుడితో కలిసి చూసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరా తీశారు.
అనంతరం.. ఆ టీనేజర్ను పోలీసులు విచారించగా తానే హత్యచేసినట్లు అంగీకరించాడు. ఓ మరుగుదొడ్డిలో గొంతునులిమి హత్యచేసిన తర్వాత మృతదేహాన్ని సూట్కేసులో కుక్కి సకినాకాలోని రోడ్డు వెంబడి ఉన్న కాలువలో పడేసినట్లు తెలిపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలల న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. అనంతరం డొంగారీలో చిల్డ్రన్ హోమ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.