గోదాములో అగ్నిప్రమాదం..

లక్షల్లో ఆస్తి నష్టం..

యాదాద్రి జిల్లాలోని రాజపేట మండల కేంద్రంలోని మార్కెట్ గోదాంలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో రూ. లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. గోదాంలో వేప గింజలు నిల్వ ఉన్నట్లు తెలుస్తుంది. ఆలేరు మార్కెట్ కమిటీ ఆధీనంలో ఉన్న ఈ గోదామును భువనగిరికి చెందిన ఓ వ్యాపారి అద్దెకు తీసుకున్నాడు. విషయం తెలిసిన ఎస్ఐ నాగిరెడ్డి వెంటనే ఘటనా స్థలికి చేరుకొని 104కు సమాచారమిచ్చారు. ఈ గోదాంకు పక్కనే మరో గోదాంలో ధాన్యం నిల్వలున్నాయి. స్థానిక యువత అప్రత్తమత్తమై ధాన్యం బస్తాలను సురక్షిత ప్రాంతానికి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

leave a reply