అరె.. గాజు గ్లాసా..? బీరు గ్లాసా..?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా తెలంగాణా ఎలక్షన్ వేళ లైవ్ వీడియోతో జనం ముందుకు వచ్చి జనసేన అధినేతను రచ్చ చేసింది. ఇప్పుడు మరోసారి పవన్ ని టార్గెట్ చేసింది. ఈ సారి పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తుపై సెటైర్స్ పేల్చింది. గాజు గ్లాస్ వచ్చిందా లేక బీరు గ్లాస్ వచ్చిందా అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

“అరె.. జనసేన పార్టీ గుర్తు గలాసు అంటగా.. అది బీరు గ్లాసా? వైన్ గ్లాసా? లేక స్కాచ్ గ్లాసా? పనిలో పనిగా నాగబాబుకి కూడా ఓ గ్లాస్ ఇవ్వండర్రా. అసలే రీసెంట్‌గా కొత్త గొంతు వచ్చిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు” అంటూ పోస్టు చేసింది.

శ్రీరెడ్డి ఇలా జనసేన గుర్తుపై కామెంట్స్ చెయ్యడంపైన పవన్ అభిమానులు తమదైన శైలిలో భగ్గుమంటున్నారు. ఆమె పెట్టిన పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విరుచుకుపడుతున్నారు.

leave a reply