ఎక్కువ ప్రాధాన్యత… వీళ్ళకే!

పొత్తుపై స్పష్టత ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన పార్టీ అధికారికంగా స్పష్టం చేసింది.  వామపక్ష పార్టీలతో బరిలోకి దిగుతామన్న అయన  ఏ అధికార ప్రతిపక్షాల పార్టీలతో కలసి వెళ్లమని వివరించింది. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అటు ఎన్నికల అభ్యర్థిత్వంలో యువతకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. పొత్తులపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మాటలను ఉపేక్షించవద్దని పార్టీ కార్యకర్తలకు తెలియచేసింది.

అయితే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సందర్భంలో మాట్లాడుతూ..  జనసేనతో  పాటి చేస్తే తప్పేముంది అని జగన్ కు గట్టిగ వివరించిన సంగతి తెలిసిందే. జనసేనపై గల మైత్రిని చాటుకున్న చంద్రబాబు వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. అయితే జనసేన టీడీపీతో కలిసి పోటీచేస్తుందా అని ఊహాగానాలు మొదలయ్యాయి . కొన్ని అనుమానాలకు కూడా దారి తీశాయి. అయితే తాజాగా  ఈ అనుమానాలకు జనసేన తగిన స్పష్టత ఇచ్చింది.అటు జనసేన నిర్ణయాన్ని సీ.పీ.ఐ నేత నారాయణ స్వాగతించారు. 

leave a reply