వైసీపీకి రాజీనామా చేసిన గౌరు వెంకటరెడ్డి దంపతులు..

కర్నూలు జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాణ్యం టికెట్ విషయంలో మనస్తాపం చెంది వైసీపీకి ఎమ్మెల్యే గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి రాజీనామా చేశారు.పాణ్యం టికెట్ విషయంలో జగన్ మొదట తమకు సీటు ఇస్తాను అని చెప్పి ఇప్పుడు వేరొకరికి సీటు కేటాయిస్తామనడం గౌరు వెంకటరెడ్డి దంపతుల్లో అసంతృప్తిని మిగిల్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చే భరోసా, జగన్‌లో కనిపించడం లేదని వెంకటరెడ్డి అన్నారు.

గతంలో ముస్లింలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్‌ ఇవ్వలేదని, ఇప్పుడు తనకు ఎమ్మెల్సీ ఇస్తానంటే జగన్‌ ఎలా నమ్మాలని ఆమె ప్రశ్నించారు. కార్యకర్తల కోరిక మేరకు ఈనెల 9న టీడీపీలో చేరుతున్నామని గౌరు చరిత దంపతులు తెలిపారు.

leave a reply