మహేష్బాబుతో బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ జతకట్టనుందట. మహేష్ 26వ సినిమా సుకుమార్తో ఉండనుంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సుకుమార్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కత్రినా కైఫ్ను తీసుకునే ఆలోచనలో టీమ్ ఉందట. ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కెరియర్ ఆరంభంలో కత్రినా ఇక్కడ ‘మల్లీశ్వరి’తో హిట్ కొట్టిన ఆమె, హిందీలో స్టార్ హీరోయిన్గా బిజీ అయింది. మహేష్ మూవీ కోసం మళ్లీ ఆమెను టాలీవుడ్కి తెచ్చే ప్రయత్నాల్లో సుకుమార్ బిజీగా వున్నాడని అంటున్నారు. అదే నిజమైతే కత్రినా ఏమంటుందో చూడాలి మరి.
ప్రస్తుతం అయితే.. మహేష్ బాబు అభిమానుల దృష్టి అంతా ‘మహర్షి’పైనే వుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మహేష్ తరువాత సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నాయి.