సినిమా అనేది ఒకరితో ముడిపడేది కాదని అందరి భాగస్వామ్యంతోనే సినిమా విజయం సాధ్యమవుతుందన్నారు నట కిరీటి రాజేంద్రప్రసాద్. తెలుగు సినిమా పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో పలువురు డైరెక్టర్స్, నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. విజయవాడలో వేసిన నా మొదటి సినిమా పోస్టర్పై పేడ కొట్టారు. ఈ సంఘటన నేను మరవలేనిదని, అయినా నేను బాధపడలేదని అప్పుడే నా ఎదుగుదల మొదలైందని అన్నారు. నా వల్లే సినిమాలు ఆడుతున్నాయని చెప్పేంత స్వార్థం తనకు లేదని అన్నారు. జీవితాంతం ప్రేక్షకులకు నవ్వించేందుకు ఉంటానని తెలిపారు రాజేంద్రప్రసాద్.
నా సినిమా పోస్టర్పై పేడ కొట్టారు
Post navigation
Posted in: