పరిచయం పెంచుకొని సహజీవనం చేసి.. తీరా పెళ్లి విషయం ఎత్తగానే తనను కాదంటున్నాడంటూ ఓ మోడల్ హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని ఇందిరానగర్లో నివసించే ఓ మోడల్(24) గతేడాది మార్చిలో సాయికృష్ణ అనే అబ్బాయి ఆమెతో పరిచయం చేసుకున్నాడు. నిత్యం మాటలు కలిపి స్నేహం పెంచుకున్నాడు. ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ సహజీవనం చేశారు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరడంతో అతను నిరాకరించాడు. దీంతో బుధవారం యువతి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
పెళ్లికి `నో’!
Posted in: