‘మణికర్ణిక’ సినిమా చిత్రీకరణ వివాదంపై హీరోయిన్ కంగనా రౌనౌత్ స్పందించింది. అయితే.. ‘మణికర్ణిక’ సినిమా దర్శకత్వంలో 70శాతం క్రెడిట్ కంగనా తీసుకోవడంపై డైరెక్టర్ క్రిష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ఎడిటింగ్ సమయంలో చాలా పాత్రల్ని కట్ చేశారని, స్క్రిప్టులో కంగనకు నచ్చినట్లు మార్పులు చేయమన్నారని క్రిష్ ఆరోపించారు. అయితే.. ‘‘మణికర్ణిక’ సినిమాకు నేనే దర్శకత్వం వహించా’ అని తొలిసారిగా ఈ వివాదంపై కంగన స్పందించింది.
నిజంగా.. సినిమా విడుదలకు ముందే క్రిష్కు సినిమా చూపించాలి అనుకున్నాం.. కానీ.. ఆయన ఉద్ధేశ్యంలో నేను సినిమాను మొత్తం నాశనం చేశా అనే భావనలో ఉన్నారు. కానీ నేను సినిమాను పూర్తి చేశా. ఇప్పుడు సినిమా మంచిగా వచ్చింది. హిట్ అయ్యింది. అందుకే అప్పటి నుంచి ‘ఇది నా సినిమా’, ‘ఇది నా సినిమా’ అని అంటున్నారని కంగన ఆరోపించింది. ఏదైనా ఉంటే నేరుగా ఆయన నాతో మాట్లాడాల్సింది. మీడియా ముందుకు ఎందుకు వచ్చారు..? ఆయన నన్ను ఒకసారి కూడా కలవలేదు. మా ఆహ్వానాలకు స్పందించలేదు’. అయినా.. నాలాగా, అంకిత, ప్రసూన్, శంకర్లాగా అంకితభావంతో పనిచేసి ఉంటే సినిమాకు ఎంతో ముఖ్యమైన వారంలో పబ్లిక్లోకి వెళ్లి యూనిట్ను ఎటాక్ చేయరు. వీరంతా కలిసి సినిమాకు నష్టం కల్గించారు’ అని కంగన పేర్కొన్నారు.