అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. అక్కినేని ఫ్యామిలీకే ప్రేమకథలు కలిసివచ్చాయనే చెప్పాలి. లవ్ అండ్ రొమాంటిక్ హీరోస్గా అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరు ఉంది. ఆ కాన్సప్ట్తో చాలా హిట్స్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. రొమాంటిక్ హీరోస్గా అభిమానుల్లో ముద్ర పడేలా చేశారు. ఇఫ్పుడు అదే కాన్పప్ట్తో యంగ్ హీరో అఖిల్ ‘మిస్టర్ మజ్నూ’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు శుక్రవారమే వస్తుంది.
నిజానికి చెప్పాలంటే.. నా ఫస్ట్ సినిమా కన్నా ముందే ‘మిస్టర్ మజ్ను’ సినిమా స్టోరీని నాకు వెంకీ అట్లూరి చెప్పారు. కానీ అప్పటికే రెండు సినిమాలు తీయడానికి ఒప్పుకున్నా. సో అందుకే లేట్ అయింది. అలాగే వెంకీతో ఈ జర్నీ చాలా బావుంది. ఒకప్పుడు వెంకీ మామూలుగా తెలుసు కానీ ఇప్పుడు ఒక మంచి ఫ్రెండ్ అయ్యాడు. నేను నటించిన రెండు సినిమాలకంటే ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని అనుకుంటున్నా. కొంచెం భయం అయితే ఉంది ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని.. ఈ సినిమాలో నా యాక్టింగ్ చాలా డిఫ్రెంట్గా ఉంటుందంటూ తెలిపారు హీరో అఖిల్. శుక్రవారం ‘మిస్టర్ మజ్ను’ సినిమా విడుదల సందర్భంగా హీరో అఖిల్ మీడియాతో మాట్లాడారు.
కాగా.. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ బానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ‘మిస్టర్ మజ్ను’ సినిమా మొత్తం రొమాంటిక్గా ఉంటందని సినీవర్గం మొదటనే తెలిపింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ నిధి అగర్వాల్.