హీరో సాయి ధరమ్తేజ్ తమ్ముడు వైష్ణవ్ టాలీవుడ్కు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్లో మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో రానుంది. అలాగే.. ఈ సినిమాలో కొత్త హీరోయిన్గా మనిషా రాజ్ అనే కొత్త అమ్మాయిని తీసుకోవడం జరిగింది. అయితే.. వైష్ణవ్ మొదటి సినిమా ప్రారంభోత్సవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్కు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రామ్చరణ్, వరుణ్ తేజ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, సుకుమార్, డీఎస్పీ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. మొదటి సినిమాతోనే మైత్రీ మూవీమేకర్స్తో కలిసి పనిచేసే అవకాశం వైష్ణవ్కి దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు. నాక్కూడా ఈ సంస్థతో కలిసి పనిచేసే అవకాశం దక్కలేదు.. కానీ ఆ అవకాశం నా మేనల్లుడికి దక్కడం వాడి అదృష్టమని.. అలాగే.. వైష్ణవ్ కూడా మంచి హిట్ అందుకోవాలని ఆశిస్తున్నా అని అన్నారు.
అలాగే.. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. బుచ్చిబాబు డైరెక్షన్లో మైత్రీ మూవీ మేకర్స్లో సినిమా రావడంతోనే ఇది ఎంత మంచి చిత్రమో మనం ముందే కనిపెట్టవచ్చు. సుకుమార్ రైటింగ్స్లో ఓ కొత్తదనం కనిపిస్తుంది. అలాగే.. మీకో విషయం చెప్పాలనుకుంటున్నా.. ‘వైష్ణవ్కు ఇదే మొదటి సినిమా అనుకుంటున్నారేమో.. కాదు వాడి మొదటి సినిమా నాది. వాడికి మొదటి చెక్కు నేనే ఇచ్చా.. పవన్ కల్యాణ్ నటించిన ‘జానీ’ చిత్రంలో పవన్ చిన్నప్పటి పాత్రలో నటించింది వైష్ణవే’ అని తెలిపారు అల్లు అరవింద్.