కొత్త వేషంలో.. మా నిరసన ఆగదు..

శుక్రవారం ఢిల్లీలో పార్లమెంట్‌ వద్ద టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ వినూత్న నిరసన చేపట్టారు. ఏపీకి ఇచ్చిన విభజనహామీలు నెరవేర్చలేని ప్రధాని మోడీకి మిత్రధర్మం లేదని పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీవిగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు నిరసన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకొని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగాఎంపీ శివప్రసాద్‌ దివంగత నేత కరుణానిధి వేషధారణలో నిరసన తెలిపారు. చంద్రబాబు స్నేహహస్తం అందిస్తే నాలుగు సంవత్సరాలు మోడీ ఏపీని మోసం చేశారని ఆరోపించారు. నాయకుడి విషయంలో కరుణానిధి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారని.. అవేవీ మోడీలో లేవని, అందుకే ఈ వేషంలో నిరసన తెలియజేసినట్లు శివప్రసాద్‌ వివరించారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ నేతలు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఎంపీలు స్పష్టం చేశారు.

leave a reply