శుక్రవారం ఉదయం టీఆర్ఎస్రాష్ట్ర కార్యవర్గం భేటీ అయింది. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి కార్యవర్గసభ్యులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుహాజరయ్యారు. ఈ భేటీలో కేటీఆర్ను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎమ్మెల్సీపల్లా రాజేశ్వర్రెడ్డి ప్రతిపాదించగా కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈసందర్భంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఇక నుంచి పార్టీవ్యవహారాలు మొత్తం కేటీఆర్ చూసుకుంటారని సభ్యులకు ఆయన స్పష్టం చేశారు.క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలని, కార్యనిర్వాహక అధ్యక్షుడు రోజూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
ప్రతి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉండాలని కేసీఆర్ అన్నారు. తనతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉంటామని చెప్పారు. పనిభారం ఎక్కువగా ఉన్నందునే కేటీఆర్కు బాధ్యతలు అప్పగించానని, పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకే ఆయన్ను నియమించామన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి అనుసంధానకర్తగా కేటీఆర్ ఉంటారని కేసీఆర్ చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రజాపోరాటాలకు నేతలంతా సిద్ధంగా ఉండాలని కేసీఆర్ అన్నారు. ఇకనుంచి ప్రభుత్వం ఇచ్చిన అన్నిహామీలు నెరవేర్చాలని కేసీఆర్ స్పష్టం చేశారు.