డ్రామాకి తెరపడింది

వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన కోడికత్తి దాడిపై ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ స్పందిస్తూ.. ఇక కత్తి డ్రామాకి తెరపడిందన్నారు. ఈ కేసును అంతర్జాతీయ విచారణ సంస్థకి అప్పగించినా నిజం మారదని అన్నారు. కావాలనే టీడీపీపై బురద చల్లాలనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన సింపతీ పెంచుకోవడానికి ఎంతకైనా తెగిస్తారని అన్నారు. కావాలనే మాతో యుద్ధానికి కాలుదూస్తున్నారంటూ ప్రధాని మోడీ, వైసీపీ జగన్‌లను ఉద్దేశించి విమర్శించారు. నాలుగేళ్లు మోసం చేసి ఆయన, పాదయాత్ర నెపంతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి ఈయన ఎంత ప్రయత్నించినా ఫలించదని లోకేశ్‌ అన్నారు.

తుస్సుమన్న కోడికత్తి డ్రామాకి కొత్త డైరెక్టర్‌ని పెట్టినంత మాత్రాన రక్తికట్టదంటూ సెటైర్లు విసిరారు. కాగా, జగన్‌పై దాడి ఘటన కేసులో చంద్రబాబును కాపాడటానికి డీజీపీ యత్నించారనీ, ఆయన్ను వదలిపెట్టబోమని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ విషయాలన్నింటిని ఎన్ఐఏ ముందు పెడతామని మంత్రి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

leave a reply