ప్రకాశంలో “ఆమంచి” పై కథలన్నీ కంచికేనా..?

చీరాల నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి పూర్తి మెజారిటితో ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు ఆమంచి కృష్ణ మోహన్ ప్రస్తుతం ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా నడుస్తుంది. నియోజకవర్గంలో తనకు తగిన హోదా ఇవ్వడం లేదని, ‌కొంతమంది కావాలని పార్టీ అధినేత వద్ద తప్పుగా ప్రచారం చేస్తున్నారంటున్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీలో ఉండాలా వద్దా.. అనేది రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.

ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయిన ఆమంచి పార్టీలో తనకు కలుగుతున్న ఇబ్బందులు, వాటిని కలిగిస్తున్న వారి పేర్లను.. చంద్రబాబుకు చెప్పాని.. అన్నింటినీ సీఎం పరిష్కరిస్తానన్నారని.. ఆమంచి భేటీ తర్వాత మీడియాకు చెప్పారు. పార్టీకి అతీతంగా ఏదో శక్తి ఇబ్బందికి గురిచేసిందన్నారు. భవిష్యత్‌లో ఇబ్బందులు ఉండవని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.

అయితే, పార్టీలోనే కొనసాగుతాను విషయాన్ని మాత్రం ఆమంచి మాట వరుసకు కూడా అనలేదు. నియోజకవర్గానికి వెళ్లి అనుచరులతో మాట్లాడతానని.. రెండు, మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని, తాను కాంట్రాక్టులు అడగలేదు, తీసుకోలేదని ఆమంచి స్పష్టం చేశారు.

పార్టీలో ఉంటానా లేనా అనేది సమస్య కాదు కానీ.. సీఎం చెప్పిన విషయాలతో ఏకీభవిస్తున్నానని మాత్రం ఆమంచి ప్రకటించారు. టీడీపీలో ఉంటానని కచ్చితంగా చెప్పని ఆమంచి… టీడీపీ ఇప్పుడు మంచి ఊపు మీద ఉందని మాత్రం ప్రకటించారు. పెన్షన్లు, పసుపు కుంకుమ జనంలోకి వెళ్లాయని, తెలుగుదేశం పార్టీ చాలా పెద్దదన్నారు. పార్టీకి మంచి ఊపు ఉన్న సమయంలోనే తాను పార్టీలో ఇమడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీకి ఇబ్బంది కలగకూడదనేది తన ఉద్దేశమని, గత ఎన్నికల్లో నవోదయం అనే పార్టీ పెట్టుకుని ఆ పార్టీ తరపున విజయం సాధించిన ఆమంచి.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. కానీ.. తెలుగుదేశంలో… చీరాల తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి పోతుల సునీతకు ఎమ్మెల్సీతో పాటు తెలుగు మహిళ అధ్యక్షురాలి పదవి ఇచ్చారు. దాంతో.. ఆమంచికి వ్యతిరేకంగా పోతుల సునీత రాజకీయం చేస్తున్నారు.

అదే సమయంలో.. జిల్లాలోని ముఖ్యమైన టీడీపీ నేతలతో కూడా ఆమంచికి సరి పడటం లేదు. దీంతో పార్టీలో ఇమడలేననే పరిస్థితికి వచ్చారు. అనుచరులతో సమావేశమయ్యి అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. గురువారం వైసీపీ నేత విజయసాయి రెడ్డిని కలిశాని విశ్వసనీయ వర్గాల సమచారం. అక్కడ చర్చలు జరిగాయాని.. శుక్రవారం వైసీపీలో చేరుతారనే నిర్ణయం ప్రకటించే ముందు చంద్రబాబు కబురు చేయడంతో ఆయనను కలిశారు. చంద్రబాబు చెప్పిన విషయాలను..మరోసారి అనుచరులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానంటున్నారు ఆమంచి. కానీ, ఆయనకు చీరాల టిక్కెట్ కన్పార్మ్‌ చేసినట్టు.. దాంతో ఆయన పార్టీ వీడే ప్రశక్తే లేనట్టు తెలుస్తుంది.

leave a reply