‘అల్లుడుశీను’ సినిమాలో జంటగా కనిపించిన ఈ జోడి మరోసారి జతకట్టనున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో విజయం సాధించిన డైరెక్టర్ అజయ్ భూపతి, బెల్లంకొండ శ్రీనివాస్ కోసం ఓ కథను రాసినట్లు సమాచారం. ఇందులో హీరోయిన్గా సమంతను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లో హీరోయిన్లను ప్రత్యేకంగా చూపిస్తారు. తన సినిమాలో వరుసగా అగ్ర హీరోయిన్లే నటిస్తుండం విశేషం. కాగా.. ప్రస్తుతం ‘సీత’ సినిమాలో శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. డైరెక్టర్ తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపిస్తుండం విశేషం.
‘సమంతా’తో మళ్లీ ఓసారి..
Post navigation
Posted in: