‘మిస్టర్ మజ్ను’గా హీరో అఖిల్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే న్యూయర్ కానుకగా ప్రేక్షకులకు `మిస్టర్ మజ్ను’ పోస్టర్ను లాంచ్ చేశారు మూవీ టీం. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ పూర్తైయింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీ ఉండబోతుంది. అఖిల్ సరసన కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది. ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని కూడా ఈ పోస్టర్ ద్వారానే వెల్లడించారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. జనవరి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వరుస పరాజయాలను చవిచూస్తున్న అఖిల్కు ఈ సినిమా విజయం అందిస్తుందని ఆశిస్తున్నారు మూవీ టీం. అందుకే తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
మజ్నూగా మురిపిస్తాడా..?
Post navigation
Posted in: