పొత్తు అనగానే… సీట్ల గురించి మొదలెట్టేశారు

తాము పొత్తు పెట్టుకుంటే కమ్యునిస్టులతో తప్ప మరెవరితోను పెట్టుకోము అని జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్రకటించడంతో ఆ పార్టీలలో నూతన ఉత్సాహం ఉరకలు వేస్తుంది. కమ్యునిస్టు ఏపీ కార్యదర్శులు రామకృష్ణ, మధులకు వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలసి పోటీ చేయాలా అని టెన్షన్ పడుతున్న సమయంలో… పవన్ ప్రకటన వారిని సంతోషపరిచింది. వెంటనే వారు పవన్ కల్యాణ్ వద్ద వాలిపోయారు.

ఒకటో తేదీ నుంచి పవన్ కల్యాణ్ విజయవాడ ఆఫీసులోనే ఎక్కువగా ఉంటూ.. జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. కమ్యునిస్టు నేతలు ఓ జాబితాను తమతో పాటు తీసుకొచ్చారు. పొత్తుల్లో భాగంగా.. తాము కోరుకునే సీట్ల జాబితాను తీసుకొచ్చి.. రెండు పార్టీల నేతలు విడివిడిగా జాబితాలు పవన్ కల్యాణ్ కు అందించారు.

చెరో 30 స్థానాల వరకూ.. పోటీ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నట్లు… కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కొంత మంది నేతలు చెబుతున్నారు. తమలకు నిబద్ధత కలిగిన ఓటర్లు ఉన్నారని.. తమ ఓట్లన్నీ కచ్చితంగా బదిలీ అవుతాయని వారు చెబుతున్నట్లు తెలుస్తోంది. పొత్తు ఉందని పవన్ ప్రకటించారు కానీ… సీట్ల సర్దుబాటు గురించి… కానీ.. ఇతర విషయాల్లో కానీ.. ఎలాంటి పిలుపులు రాకపోవడంతో.. కమ్యూనిస్టు నేతలే చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది.

నిజానికి పవన్ కల్యాణ్ జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఆయన పొత్తులపై సీరియస్ గా దృష్టి పెట్టలేదని… జనసేన పార్టీకి చెందిన వారు చెబుతున్నారు. కమ్యూనిస్టు పార్టీలు సీట్ల సర్దుబాటు జాబితాలతో వచ్చేయడంతో.. పవన్.. నాదెండ్ల మనోహర్ కు చర్చల బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.

ఇప్పుడే మాట్లాడుకోవడం తొందర అవుతుందని.. సంక్రాంతి పండుగ తర్వాత మాట్లాడుకుందామని.. కమ్యూనిస్టు నేతలిద్దరూ నాదెండ్ల చెప్పి పంపించినట్లు తెలుస్తోంది. మొత్తానికి కమ్యూనిస్టు పార్టీల నేతలు.. పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో… పొత్తుల నుంచి సీట్ల సర్దుబాటు వరకూ వచ్చేశారు. మరి ఎన్ని సీట్లు వస్తాయో.. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో సమయం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

leave a reply