‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్గా ‘భారతీయుడు 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ ఓ విభిన్న పాత్రలో కనిపించబోతున్నరాని ఇటీవలె డైరెక్టర్ శంకర్ తెలియజేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ నటిస్తోంది. అయితే.. ఇందులో ఓ ప్రధానమైన పాత్రకు అమితా బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ నటించనున్నారని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాగా.. ఇటీవలె ఈ సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభమైంది. ఇందులో అభిషేక్ కీలక పాత్రలో నటించనున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రంలో అభికి పవర్ఫుల్ పాత్ర దక్కినట్లు తెలుస్తోంది. తన పాత్ర గురించి శంకర్ వివరించగానే ఆయన వెంటనే ఒప్పుకున్నారట. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్కుమార్ కూడా విలన్ పాత్రలో కనిపించే అవకాశం ఉందట. తాజాగా ‘2.0’ సినిమాలో విలన్ పాత్రలో కనిపించి అక్షయ్ అందరినీ అబ్బురపరిచారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాష్కరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.