కమల్ హాసన్ కూతురిగా శ్రుతి హాసన్ ఇండస్ట్రీకి పరిచయమైనా.. తన నటనతో మంచి పేరుతెచ్చుకుని.. తండ్రి తగ్గ తనయురాలుగా తన నటనను చాటుకుంది. అయితే.. ఈ మధ్య శ్రుతిహాసన్ పెళ్లి చేసుకుంటుందనే వార్త బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతంది. శ్రుతి యూరప్కు చెందిన మైఖెల్ కోర్సేల్తో ప్రేమలో ఉన్నారని జనాల్లో నానుతున్న సంగతే.. కాగా.. మైఖెల్ కూడా శ్రుతి కోసం ఇండియా వచ్చినట్లు.. కమల్ హాసన్తో మాట్లాడినట్లు.. మైఖెల్, శ్రుతి బంధువుల పెళ్లికి హాజరవటం.. ఇవన్నీ చూస్తుంటే.. వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకూ వచ్చేసిందని.. దానికి కమల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు.
కాగా.. ఇటీవల శ్రుతి లండన్ వెళ్లడం.. మైఖెల్ను కలవాలని చాలా ఆతృతగా ఉందనడం గమనార్హం. అలాగే శ్రుతి అక్కడే క్రిస్మస్, న్యూయర్ సెలెబ్రేషన్స్ను చేసుకోవడం.. ఆ ఫొటోలు ఫేర్ చేయడంతో.. ఈ బంధం గట్టిదే అని మరోమారు వీరి పెళ్లి ప్రచారం మళ్లీ మొదలైంది.
అయితే.. 2019లో త్వరలోనే శ్రుతి, మైఖెల్ పెళ్లి చేసుకోబోతున్నారని ఓ పత్రిక రాసిన వార్తను శ్రుతి ఖండించారు. ఆ వార్తను రీట్వీట్ చేస్తూ.. ‘నిజంగా?.. ఇది నాకు వార్తే’ అంటూ పరోక్షంగా విమర్శించారు. కాగా.. ప్రస్తుతం ఆమె కమల్ కథానాయకుడిగా నటిస్తున్న ‘శభాష్ నాయుడు’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోపక్క పలు మ్యూజిక్ ఆల్బమ్ల కోసం వర్క్ చేస్తుంది.