సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న ‘మహర్షి’ సినిమాను మే 9న విడుదల చేస్తున్నామని నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ప్రకటించారు.మహర్షి చిత్రం చిత్రీకరణ తుది దశలో ఉంది అని , మార్చి 17 నాటికి రెండు సాంగ్స్, కొన్ని మాంటెజెస్ సీన్స్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని చెప్పారు. రెండు సాంగ్స్ను సెట్ వేసి తీస్తాం, మాంటేజ్ సన్నివేశాలను అబుదాబిలో చిత్రీకరిస్తాం అని తెలిపారు.
ఈ ఏడాది సంక్రాంతికి మా బ్యానర్లో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాం. ఈ సమ్మర్లో కూడా ‘మహర్షి’తో హిట్ కొడుతున్నాం అని చెప్పారు.