దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితాధారంగా తెరెకెక్కిన చిత్రం ‘యాత్ర’. కాగా.. ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానున్నది. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అమెరికాలోని సియాటెల్లో ఈ సినిమా టికెట్లపై వేలం నిర్వహించారట. వేలంలో ‘యాత్ర’ మొదటి షో టికెట్ను ఎన్నారై అయిన మునీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి 6,116 డాలర్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి ‘యాత్ర’ సినిమాకై అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. 6,116 డాలర్లు అంటే.. మన కరెన్సీలో అక్షరాలా రూ.4లక్షల 37వేలు అన్నమాట.
కాగా.. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ముమ్ముట్టి ప్రధాన పాత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్కు అనూహ్యమైన స్పందన వచ్చింది. డైరెక్టర్ మహి.వి. రాఘవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 70 ఎంఎం బ్యానర్పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తున్నారు. అలాగే.. ఈ సినిమాలో ‘సీఎం చంద్రబాబు’, ‘వైఎస్ జగన్’ పాత్రలు లేవని ముందుగానే డైరెక్టర్ చెప్పడం కొసమెరుపు.