రిషబ్ పంత్… పైన్ పిల్లలతో?

భారత్ ఆస్ట్రిలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.  ఆస్ట్రిలియన్ కెప్టెన్ పైన్ కు ఇండియన్ కీపర్ రిషబ్ పంత్  మధ్య మూడో టెస్టులో మతాల యుద్ధం తార స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే..దీనిపై అంపైర్ కూడా రిషబ్ కి  కొన్ని సూచనలు చేసాడు. కానీ ఆటలో స్లెడ్జింగ్ ఒక భాగమే అని యువ క్రికెటర్ రిషబ్ పంత్ నిరూపించాడు. ఆటలో ఎలా ఉన్న ఒక్క సారి మైదానం విడిచి వచ్చాక అంత ఒక్కటే అని నిరూపించుకున్నాడు . తాజాగా మూడో టెస్టులో ఆసీస్ కేప్టిన్ టిమ్ పైన్ .. “పంత్ నా పిల్లలను ఆడించు నేను నా భార్యతో సినిమాకి వెళ్తాను” అని చమత్కరించాడు. కానీ దీనిని సరదాగా తీసుకున్న యువ క్రికెటర్ పంత్ పైన్ ఇంటికి వెళ్లి వాళ్ళ పిల్లలతో సరదాగా గడిపాడు. ఈ విషయాన్ని పైన్ భార్య బోనీ పైన్ వివరిస్తూ ఒక ఫోటోను పోస్ట్ చేసింది.

leave a reply