టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు ఇపుడు మరో ఆఫర్ వచ్చింది..అది కూడా రోహిత్ నుంచి కావడం విశేషం. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా కీపింగ్, బాటింగ్ తో ఆకట్టుకోవడమే గాక స్లెడ్జింగ్లోను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సిరీస్ ఆసాంతం వార్తల్లో నిలిచిన ఈ యువ క్రికెటర్.. బెస్ట్ బేబీసిట్టర్గా ఆసీస్ కెప్టెన్ పైన్ సతీమణి బొన్ని పైన్ చేత ప్రశంసలు అందుకున్నాడు. అయితే తాజాగా సిరీస్ మధ్యలో స్వదేశంకి తిరిగి వచ్చిన రోహిత్ కి కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల తండ్రైన టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. పంత్ కు తన సందేశం తెలియచేసాడు. బెస్ట్ బేబీసిట్టర్గా నీకు మంచి పేరుందని.. తన కూతురుని కూడా ఆడించాలని పంత్ను కోరాడు.‘శుభోధయం బడ్డీ.. నీవు మంచి బేబీ సిట్టర్వని విన్నా. రితికాను సంతోషంగా ఉంచాలంటే నాకు ఓ బేబీ సిట్టర్ కావాలి అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు.
దీనికి ప్రతిగా పంత్ స్పందిస్తూ.. అంతకంటే హ్యాపీ ఏముంది భయ్యా అంటూ రోహిత్కు బదులిచ్చాడు. పాప సమైరాను ఆడించే భాధ్యతను ఆనందంగా స్వీకరిస్తా అని తెలిపాడు. అంతేకాకుండా బొన్ని పైన్ కూడా నీవు ఫ్రీగా ఉంటే మరోసారి నాపిల్లలను ఆడించవా’ అని పోస్ట్ చేసింది. వన్డే తుది జట్టులోకి ధోని రాకతో పంత్ కు విశ్రాంతి దొరికింది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ కూడా దూరంగా ఉండనున్నాడు.