వందమంది అసద్‌లు వచ్చినా… బాబు ఒక్కడు చాలు..!

ఏపీలో పర్యటిస్తానన్న ఎంఐఎం నేత అసద్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశం నేత, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఓవైసీని ఎవరూ పట్టించుకోరని.. ఎంఐఎం హైదరాబాద్‌లోని అయిదు స్థానాలకే పరిమితమవుతుందని ఎద్దేవాచేశారు.

వంద మంది ఓవైసీలు వచ్చినా.. చంద్రబాబు ఒక్కడే ఎదుర్కొనగలరని జలీల్ ఖాన్ అన్నారు. విజయవాడ పాతబస్తీలోని మాడపాటి క్లబ్‌లో జయహో బిసి పోస్టర్‌ను ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయనపాల్గొన్నారు.

రెండు, మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, ఆంధ్రులు మళ్ళీ తలెత్తుకొని తిరగాలంటే టిడిపి అధికారంలోకి రావాలని ఆయన స్పష్టం చేశారు.

కాగా, ఈ నెల30న రాజమండ్రిలో తెలుగుదేశం జయహో బీసీ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆ కార్యక్రమంలో బీసీలంతా పాల్గొని జయప్రదం చేయాలని జలీల్‌ ఖాన్ పిలుపునిచ్చారు.

leave a reply