హైదరాబాద్:చిట్టీల పేరుతో ఖాతాదారుల నుంచి సుమారు రూ. 200 కోట్లు వసూలు చేసి పరారైన రిషబ్ చిట్ ఫండ్ యజమానిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ గుజ్జర్,అతని భార్య నందినిని బోయగూడలోని వారి నివాసంలో గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని సికింద్రాబాద్లోని రిషబ్ చిట్ఫండ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. వారిద్దరి సమక్షంలోనే సుమారు మూడు గంటల పాటు కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తిదర్యాప్తు నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. వారి అరెస్టు సమాచారంతో బాధితులు పెద్ద ఎత్తున శైలేష్ నివాసం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
చిట్ ఫండ్ యజమాని.. అరెస్ట్ !
Posted in: