వృద్ధాప్య ఛాయలకు చెక్‌..

ప్రస్తుత కాలంలో అందరూ వాటర్ ప్యూరిఫయ్యర్‌లకు అలవాటు పడి రకరకాల ఫిల్టర్స్‌ను, ప్లాస్టిక్‌ బాటిళ్లను ఉపయోగిస్తున్నారు. కాని పాతకాలంలో మాత్రం రాగి బిందెలు, గ్లాసులలో నీరు తాగడం వలన వారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కనుక మనం వెనుకటి వారిలా ఆ రాగి పాత్రలను ఉపయోగించడం వలన ఎంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని ఉదయాన్నే తాగడం ఆరోగ్యానికి మంచిదని సైన్స్‌ కూడా చెబుతోంది. రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. రాగి పాత్రల్లో నీటిని నిల్వ ఉంచడం వల్ల అది సహజంగానే శుద్ధి అవుతుంది. నీటిలోని సూక్ష్మజీవులు నాశనం అవుతాయి. అలాగే ఇప్పుడు కూడా రాగి బాటిల్స్‌ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి ఆరోగ్యంగా ఉండొచ్చు.

రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని ఉదయాన్నే తాగడం వలన శరీరంలోని కఫ, వాత, పిత్త దోషాలను బ్యాలెన్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. శరీరంలోని వివిధ అవయవాల పనితీరు మెరుగుపడేందుకు కూడా ఇది సహకరిస్తుంది. కడుపులో మంట తగ్గుతుంది. అల్సర్లు తగ్గడానికి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవడానికి ఇది సహకరిస్తుంది. కాలేయం, కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. ఆహారంగా తీసుకున్న పోషకాలు శరీరానికి అందుతాయి.

వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం ప్రయోజనకరం. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి, జీర్ణక్రియ పనితీరు మెరగుపడటానికి రాగి పాత్రలోని నిల్వ ఉంచిన నీటిని తాగడం ఉపకరిస్తుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల తనకు అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకొని మిగతా వాటిని శరీరం బయటకు పంపుతుంది. గాయాలు త్వరగా మానడానికి కూడా ఇది ఉపకరిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త కణాల ఉత్పత్తికి రాగి దోహదం చేస్తుంది. శరీరంలో లోపల, ముఖ్యంగా కడుపులో ఏర్పడిన పుండ్లను మాన్పడానికి రాగి సహకరిస్తుంది.

వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి, రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి రాగి్ పాత్రలో నిల్వ ఉంచిన నీరు సహాయపడుతుంది.

leave a reply