ఇద్దరు బిడ్డలను చంపి.. తానూ ఆత్మహత్య

కుటుంబ కలహాలు పచ్చని కాపురంలో చిచ్చు పెట్టడమే కాక, తల్లితో పాటు ఇద్దరు పిల్లల బలవన్మరణానికి కారణమయ్యాయి. భర్త మీద తీవ్ర ఆగ్రహానికి గురైన ఇల్లాలు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మైసూరు నగరానికి చెందిన ఆశా, మహేష్ దంపతులకు పది సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వీరు నగరంలోని బండిపాళ్యంలోనే కిరాయి  ఇంట్లో కాపురం పెట్టారు. వీరికి శౌర్య, సుప్రీత్ అనే 8 సంవత్సరాల కవల పిల్లలున్నారు. భార్య భర్తలు, ఇద్దరి పిల్లలతో అన్యోన్యంగా వారి జీవితం సాగుతుంద. ఇంతలోనే భార్య భర్తల మద్య కలహాలు మొదలయ్యాయి. గత సంవత్సర కాలం నుంచి భార్య భర్తల మధ్య తీవ్ర గొడవలు జరుగుతున్నాయి.

బుధవారం రాత్రి దంపతుల మధ్య చాలా తీవ్రమైన పంచాయతీ జరిగింది. దీంతో ఆశా మనస్తాపం చెందింది. భర్త మహేష్ గురువారం ఉదయం పనికి పోగానే ఆశా తన పిల్లలను గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం మహేష్ పనికి పోయి రాగా  ఇంటి తలుపులు పెట్టి ఉన్నాయి. ఎంత పిలిచినా తలుపు తీయలేదు. దీంతో చుట్టు పక్కల వారి సహాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ముగ్గురు విగజీవులుగా కనిపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆశా రాసిన డెత్‌నోట్‌ స్వాధీనం చేసుకున్నారు. అందులో తమ మరణాలకు ఎవరూ కారణం కాదని తన వల్ల తన కుటుంబానికి అవమానం జరిగిందనే మనస్థాపంతోనే పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డట్లు రాసింది. తమ ముగ్గురిని ఒకే చితిలో దహనం చేయాలని కూడా ఆశా అందులో రాసారు. మైసూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే ఆశ పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడడంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి.

leave a reply