వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య!

రిమ్స్‌ వైద్యుల పర్యవేక్షణలో మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి పోస్టుమార్టం పూర్తైంది.ఆయన శరీరంలో ఏడు చోట్ల బలమైన గాయాలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. తలలో రెండు వైపులా కత్తితో పొడిచిన గాయాలు ఉన్నాయని,ఛాతి,చేతిపైనా కత్తిపోట్లు ఉన్నట్టు తెలిపారు.శుక్రవారం ఉదయం పులివెందులలోని తన నివాసంలో రక్తపు మడుగులో పడి ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తంచేశారు.వైఎస్‌ వివేకానంద రెడ్డిది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. అసలు ఆయనను హత్య ఎవరు చేశారు దానికి గల కారణాలు ఏంటి అని వెతికే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. మొత్తంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ వార్త ఒక సంచలనం అయ్యింది.

శుక్రవారం సాయంత్రం పులివెందుల చేరుకున్న జగన్… తన చిన్నాన్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర పోలీసుల దర్యాప్తు మీద తనకు నమ్మకం లేదు అని సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. తన చిన్నాన్న మృతికి చంద్రబాబే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ వివేకానందరెడ్డి మృతిని అన్ని కోణాల్లో విచారిస్తున్నామని దోషులు ఎంతటి వారు అయినా శిక్షిస్తామని తెలిపారు.

leave a reply