నిశ్శబ్ద విప్లవం…విజయం సాధించి పెట్టింది

తెలంగాణలో జరిగిన ఎన్నికలలో ఎవరు ఊహించని ఫలితం సాధించిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తుది తీర్పుతో కాంగ్రెస్‌ నేతలకు దిమ్మతిరిగిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు తెరాసలోచేరగా.. ఈ సందర్భంగా అయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల పోటీకి వెళ్లిన వారు ఎవరు గెలవలేదని , మీరు వెళ్లొద్దని సూచించారన్నారు. అలాంటి మాటలను లెక్కచేయకుండా వెళ్లిన తెరాసకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారని చెప్పుకొచ్చారు. నాలుగింట మూడొంతుల మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని వివరించారు .

రాష్ట్రంలో తమకు వచ్చిన విజయాన్ని చూసి ఓర్వలేక నిశ్శబ్ద విప్లవం ఉందంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. అయితే ఎన్నికలు జరగక ముందే కాంగ్రెస్‌ నేతలు మంత్రి పదవుల పంపకాలను చేపట్టారని కేటీఆర్‌ విమర్శించారు . తెలంగాణ ప్రజల తీర్పుతో కొంత మంది కాంగ్రెస్‌ నేతలు రాజకీయాల నుంచి తప్పుకొని పనిలో ఉన్నారని, మరికొంతమంది ఇప్పటికే మీడియాకు ముఖం చాటేశారని ఆయన‌ విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో సుమారు 2 లక్షల ఓట్లు తెరాసకు దూరమవడంతో కేవలం 47 శాతం మాత్రమే వచ్చాయన్నారు.

leave a reply