శనివారమే ఇష్టం.. ఎందుకని..!

ఆచారాలు-సంప్రదాయాలు భారతదేశానికి పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా భారతేదశం ఇంతగా పేరు గాంచిందంటేదానికి మనకు ఉన్న ఆచారాలు-సంప్రదాయాలే కారణమని చెప్పుకోవచ్చు. అలాగే భారతదేశంలోపూజలు కూడా చాలా పురాతనం నుంచి వస్తున్నది. అందులోని శ్రీ వెంకటేశ్వరుడు కొలువున్నతిరుపతి అంటే చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం అని చెప్పవచ్చు. అయితే శ్రీనివాసుడినిఎందుకు శనివారమే ప్రత్యేకంగా సేవిస్తారో.. ఎవరికైనా తెలుసా..? మరి ఇంకెందుకుఆలస్యం తెలుసుకోండి..!

శ్రీనివాసుడు కొలువైన క్షేత్రాలు.. ఆలయాలు శనివారం రోజున మరింతగా భక్తుల రద్దీతో కనిపిస్తుంటాయి. శనివారమంటే శ్రీనివాసుడికి ఇష్టం కనుకనే, ఆ రోజున ఆ స్వామిని దర్శించుకోవాలని భక్తులు ఉత్సాహాన్ని చూపుతుంటారు. శ్రీనివాసుడు తన ఆలయ నిర్మాణం చేయమని భక్తుడైన తొండమాన్ చక్రవర్తిని ఆదేశించింది శనివారం. స్వామివారు ఆలయ ప్రవేశం చేసిన రోజు శనివారం. భక్తులకు ఆయన తొలిసారిగా దర్శనమిచ్చిన రోజు కూడా శనివారమే.

ఇక శ్రీనివాసుడు.. పద్మావతిదేవిని వివాహమాడినది శనివారమే. శ్రీనివాసుడిని ఎవరైతే పూజిస్తూ.. సేవిస్తూ వుంటారో, వారి దరిదాపుల్లోకి రానని స్వామివారికి శనిదేవుడు మాట ఇచ్చినది కూడా శనివారమే. కాబట్టి.. శ్రీనివాసుడికి శనివారమంటే ఇష్టం కనుకనే, ఆయన ఆయా కార్యాలు శనివారం జరిగేలా చూసుకున్నారు. అలాంటి శనివారం రోజున స్వామివారిని దర్శించుకోవడం వలన.. స్మరించుకోవడం వలన సమస్త పాపాలు.. దోషాలు తొలగిపోయి, సకల శుభాలు చేకూరతాయనేది భక్తుల నమ్మిక.

leave a reply