సమ్మెకు…మరోసారి

గతవారం  ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేసిన సంఘటన మరువక ముందే.. మరోసారి సమ్మె బాట పట్టారు. ఉద్యోగ విధానాలపై కేంద్ర ప్రభుత్వ పని తీరును నిరసిస్తూ..10 ట్రేడ్‌ యూనియన్లు పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా జనవరి 8,9 తేదీలలో సమ్మె చేయనున్నట్లు బ్యాంకు సంఘాలు తెలియజేశాయి. ఈ మేరకు సమ్మెకు  మద్దతుగా అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ), భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య(బీఈఎఫ్‌ఐ) కలిసి రానున్నాయి.

పెన్షన్‌ మరియు వేతన సవరణతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికై దేశ వ్యాప్తంగా సమ్మెకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చాయి. ఈ పిలుపు మేరకు డిసెంబరు 21న బ్యాంకుల అధికారులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.

leave a reply