`బావర్చి’ బంద్‌

హైదరాబాద్‌ మహానగరంలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో గల బావర్చి హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం మధ్యాహ్నం సీజ్‌ చేశారు. హోటల్‌ నిర్వాహకులు తడి-పొడి చెత్త నిర్వహణ చేపట్టడం లేదని, ఆర్గానిక్‌ వేస్ట్‌ కన్వర్టర్‌ యంత్రాన్ని పెట్టుకోవాలని సూచించినప్పటికీ వారు ఇప్పటికీ స్పందించలేదన్నారు. జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా హోటళ్ల నిర్వాహకులు వ్యర్థపదార్థాలను మ్యాన్‌ హోల్లోకి వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నిసార్లు నోటీసులు ఇస్తున్నా పట్టించుకోకపోవటంతో హోటల్‌ను సీజ్‌ చేసినట్టు ఏఎంహెచ్‌వో డాక్టర్‌ హేమలత తెలిపారు.

నగరంలో ఉన్న అన్ని హోటళ్లకు నోటీసులు ఇచ్చామని వారు సరైన శుభ్రత పాటించకపోతే హోటళ్లు సీజ్‌ చేస్తామని తెలిపారు. 2016 నుంచి ఈ హోటల్‌కు నోటీసులు ఇస్తున్నా వారు పట్టనట్టు ఉండటంతో ఈ రోజు సీజ్‌ చేసినట్టు హేమలత తెలిపారు.

leave a reply