300 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాతో చియాన్ విక్రమ్ .

దక్షినాదిన భారీ బడ్జెట్ సినిమాల శకం మొదలైంది.

 

దక్షినాదిన  భారీ బడ్జెట్ సినిమాల  శకం మొదలైంది. తమిళనాట  మరో పెద్ద  సినిమాలో  విక్రమ్ నటించబోతున్నాడు. ఇప్పటికే జక్కన్న బాహుబలి శంకర్ 2.ఓ ప్రేక్షకులను అలరించి విజయాన్ని అందుకున్నాయి . ఇప్పుడు  300 కోట్ల రూపాయలతో  చియాన్  విక్రమ్  ‘మహావీర్ కర్ణ’ చిత్రంను  రూపొందించబోతున్నాడు . మరో వైపు మలయాళంలో కూడా వెయ్యి కోట్ల మూవీ రూపొందుతోంది. ఈ సమయంలోనే తమిళంలో మరో భారీ చిత్రం మొదలవడం విశేషం .

ఈ సినిమా  గురించి కొన్ని  నెలల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి సమాచారం  బయటకు రాలేదు . దాంతో మహావీర్ కర్ణ ప్రకటనతోనే ఆగిపోయిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి . కాని తాజాగా షూటింగ్ ప్రారంభం అయ్యిందంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ముందు ముందు మరిన్ని భారీ  బడ్జెట్  సౌత్ ఇండియన్  సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్ విషయంలో బాలీవుడ్ ను సౌత్ సినిమాలు తలదన్నెలా ఉండడం  సౌత్ ఇండియన్ సినీ అభిమానులు   ఎంతో సంతోషించదగ్గ  విషయం.

leave a reply