దివంగత శ్రీదేవి కూతురు, బాలీవుడ్ నటి జాన్వి కపూర్, ఇటీవల ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్కు హాట్హాట్గా ఫొటో షూట్ ఇవ్వగా, అది వైరల్ అవుతున్న నేపథ్యంలో, ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఫొటో షూట్ కోసం, తన జుట్టును పొట్టిగా కత్తిరించుకున్న ఆమె, ఈ విషయం తన తండ్రి బోనీ కపూర్ కు తెలియదని చెబుతోంది. ఈ విషయం ఆయనకు తెలిస్తే తనను చంపేస్తారని కూడా వ్యాఖ్యానించింది.
తొలి చిత్రంతోనే బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తొలి ఐఏఎఫ్ మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పైలట్ దుస్తుల్లో జాన్వి ఫొటోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పాటు ఆమె ‘తఖ్త్’ అనే చారిత్రక చిత్రంలోనూ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించనున్నారు.